ది.27-11-18 మంగళవారం రోజున గుడివాడలో 
రామపునర్వసు రాగనీరాజనం ఘనంగా 
జరిగింది.  సత్యనారాయణపురం లోని ఉపద్రష్ట వారి సత్రంలో    అత్యంత భక్తి శ్రధలతో జరిగింది.
రామదాసు రచించిన నవరత్న కీర్తనలలో కొన్నింటిని మరియు ఇతర వాగ్గేయకారులు రచించిన  కీర్తనలను గానం చేశాము.
రాముని కృపతో చాలా తృప్తి గా జరిగింది. 
ఈ  స్వరార్చనకు  భక్తులు, సంగీతాభిమానులు ఎక్కువమంది
(దాదాపు 50 మందికి పైగా) వచ్చారు.  వచ్చినవారందరకు తీర్ధ ప్రసాదాలు  (పులిహోర, అప్పాలు, రవ్వకేసరి, ఉండ్రాళ్ళు, కట్టెపొంగలి) ఇవ్వటం 
జరిగింది.
ఈ ధార్మిక కార్యక్రమానికి ప్రతినెల సహకరిస్తున్న మీకు ప్రత్యెక ధన్యవాదములు.