శ్రీ అలమేలు మంగ సర్వయ్య ధార్మిక సంస్థ నిర్వాహకులకు 

నమస్కారములతో
అయ్యా,
 
ది.16-06-18 శనివారం  రోజున గుడివాడలో 
రామపునర్వసు రాగనీరాజనం ఘనంగా 
జరిగింది.  సత్యనారాయణపురం లోని ఉపద్రష్ట వారి సత్రంలో    అత్యంత భక్తి శ్రధలతో జరిగింది.
రామదాసు రచించిన నవరత్న కీర్తనలలో కొన్నింటిని మరియు ఇతర వాగ్గేయకారులు రచించిన  హనుమంతుని కీర్తనలను గానం చేశాము.
రాముని కృపతో చాలా తృప్తి గా జరిగింది. 
​ఈ  స్వరార్చనకు  భక్తులు, సంగీతాభిమానులు 
దాదాపు 60  మందికి పైగా వచ్చారు.  వచ్చినవారందరకు తీర్ధ ప్రసాదాలు (అప్పాలు, గారెలు, దద్ధోజనం) ఇవ్వటం ​
జరిగింది.
ఈ ధార్మిక కార్యక్రమానికి ప్రతినెల సహకరిస్తున్న మీకు ప్రత్యెక ధన్యవాదములు.​