ది.19-08-17 శనివారం  రోజున గుడివాడలో 
రామపునర్వసు రాగనీరాజనం ఘనంగా 
జరిగింది.  సత్యనారాయణ పురం లోని ఉపద్రష్ట వారి సత్రంలో   అత్యంత భక్తి శ్రధలతో జరిగింది.
రామదాసు రచించిన నవరత్న కీర్తనలలో కొన్నింటిని మరియు వినాయకునిపై, కృష్ణునిపై, అమ్మవారిపై కీర్తనలు  గానం చేశాము.
రాముని కృపతో చాలా తృప్తి గా జరిగింది. 
​ఈ  స్వరార్చనకు  భక్తులు, సంగీతాభిమానులు 
దాదాపు 40  మందికి పైగా వచ్చారు. వర్షం వలన దాదాపు 20 మంది రాలేకపోయారు. వచ్చినవారందరకు తీర్ధ ప్రసాదాలు (సొజ్జప్పాలు) ఇవ్వటం ​
జరిగింది.
ఈ ధార్మిక కార్యక్రమానికి ప్రతినెల సహకరిస్తున్న మీకు ప్రత్యెక ధన్యవాదములు.​